వల్లభరావుపేట గ్రామంలో ఇంటింటికి జనసేన సిద్దాంతాలు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వల్లభరావుపేట గ్రామంలో సోమవారం ఉధయం 7:00 గంటలకు గ్రామాల్లోకి వెల్లడం జరిగింది. జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అలుపు ఎరుగని కార్యదీక్షతో ప్రతి గ్రామాన్ని సందర్శించిన వ్యక్తి జనసేనపార్టీ జిల్లా నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు మరియు రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ జనసేనపార్టీ యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు సోమవారం వల్లభరావుపేట గ్రామంలో ఇంటింటికి వెళ్ళి జనసేనపార్టీ సిద్దాంతాలు మరియు మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగింది. గత కోన్ని సంవత్సరాల నుండి కుటుంబ పరిపాలన జరుగుతుంది. రెండు పార్టీల పరిపాలన చూసారు ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి. జనసేనపార్టీ వచ్చినట్లు అయితే సంవత్సరానికి 5 గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇవ్వబడును. తెల్లరేషన్ కార్డుదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఉచితంగా ఇవ్వబడును, రైతులకు పెన్షన్ సౌకర్యం కల్పించబడును. నిరుద్యోగులకు ఎటాలక్ష ఉద్యోగాలు ఇవ్వబడును కనుక ఈసారి జనసేనపార్టీకి అవకాశం కల్పించాలని మద్దతు కోరడం జరిగింది. ప్రజలు కూడా ఈసారి జనసేనపార్టీని ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని గెలుపించుకోవాలని ప్రజలు చెప్పారు. ఈ కార్యక్రమంలో వల్లభరావుపేట గ్రామ జనసైనులు గుడి మహేష్ బాబు, గడి సురేష్, గడి గౌరినాయుడు, బోంతు వాసు, బోంతు రంజిత్, గడి దుర్గాప్రసాద్, లింగాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.