దేవీ నవరాత్రి ఉత్సవాలలో జనసేన

మైలవరం గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ జైదుర్గ భవాని టాక్సీ స్టాండ్ ఓనర్స్, డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కనక దుర్గమ్మ అమ్మవారికి మరియు శ్రీ దుర్గా మోటార్ వర్కర్స్ యూనియన్ మరియు కొత్తగేటు, కేతనకొండ గ్రామంలో వారి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు అందుకున్న జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ). అనంతరం కోట మహాలక్ష్మి దసరా ఉత్సవకమిటీ ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవకమిటీ వారు దుశ్శాలువాతో గాంధీని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ వారు మరియు జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, మండల నాయకులు గుమ్మడి శ్రీనివాసరావు, చంద్రాల మురళీకృష్ణ, పొన్నూరు విజయ్ కుమార్, కూసుమంచి కిరణ్ కుమార్, మాదాసు సుబ్బారావు, జనసేన నాయకులు ఎన్.నారాయణరావు, మేడూరి కోటేశ్వరావు, దాసరి వెంకట శశికుమార్, కె.రవి, అడ్డగిరి రామకృష్ణ, పాండు, విజయ్, యతిరాజు ప్రవీణ్, నాగబాబు, అక్కల సత్యనారాయణ, కొరివి గోపాల్ రావు, సిరిపురం సురేష్, రామాంజనేయులు, వెంకటస్వామి, బాలు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.