Kurnool: బేతంచర్ల మున్సిపాలిటీ అభ్యర్థులను గెలిపించాలని గడప గడపకు ప్రచారం

పత్తికొండ జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు C రాజశేఖర్, పత్తికొండ నియోజకవర్గం నుండి వెళ్లి కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గం, బేతంచెర్ల మున్సిపాలిటీ నందు, జనసేన పార్టీ తరుపున నామినేషన్ వేసిన అభ్యర్థులు, (1,శ్రీ లక్ష్మినారాయణ శాస్త్రి 1వ వార్డు), (2, శ్రీమతి చాముందేశ్వరి 9వ వార్డు,)(3 శ్రీకాంటి మధు 10వ వార్డు),(4, శ్రీ పొల మధు 8వ వార్డు,) (5, శ్రీమతి సునీత 13వ వార్డు) (6, శ్రీ చల్ల మద్దిలేటీ 17వ వార్డు,)(7, శ్రీమతి సరోజ 20వ వార్డు) బేతంచర్ల మున్సిపాలిటీ అభ్యర్థులను గెలిపించాలని గడప గడప తిరుగుతూ రెండు రోజుల నుంచి ప్రచారం చేశారు, వైసిపి టిడిపి అభ్యర్థులను ఓడించి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను గెలిపించాలని. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం,అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచిపోయినా, బేతంచర్ల లో 1% కూడా అభివృద్ధి జరగలేదని, ఇక్కడ ప్రస్తుతం ఉన్న వంటి, (ఆర్థిక శాఖ మంత్రి, బుగ్గన రాజారెడ్డి,) ప్రజలను గాలికి వదిలేసి, వైసిపి ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయి, పేద, మధ్యతరగతి, ప్రజలపై, పన్నుల భారాలు మోపుతూ, నిత్యావసర సరుకుల ధరలతో పాటు, బస్ చార్జీలు విద్యుత్ ఛార్జీలు, కులాయి పన్నులు, ఇంటి పన్నులు, చెత్త పై పన్నుల భారాన్ని మోపుతున్న ఇలాంటి పార్టీలకు ఓటు వేస్తారా, ఈ ప్రభుత్వం వల్ల, బేతంచర్ల లో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, ఇప్పుడున్న నీతివంతమైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క జనసేన పార్టీ మాత్రమే, బేతంచర్ల లో జనసేన పార్టీ తరఫున మొదటిసారి పోటీ చేయబోతున్నాం, కావున మీకు మీ కాలనీలో ఏదైనా సమస్య వస్తే జనసేన పార్టీ తరఫున వార్డ్ నెంబర్ల గా పోటీ చేసిన వ్యక్తులు గెలిపిస్తే, మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని, మీరు ఓటు వేసి గెలిపిస్తే మీకు పని చేసి పెడతామని,ఓడితే మాత్రం మీ తరఫున ముందుండి పోరాడతామని బేతంచర్ల ఓటర్ మహాశయులకు ఆలోచించు మరి మీరు ఓటు వేయండి అని తెలియజేశారు.