క్రికెటర్ రషీద్ కు జనసేనాని ఆర్ధిక సాయం

*అండర్-19 క్రికెట్ వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కు రూ.2,00,000/-లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించిన‌ జనసేన అధినేత పవన్ కళ్యాణ్

గుంటూరులో రషీద్ నివాసానికి వెళ్లి చెక్కును తన తరపున అందజేయాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబుకి‌ జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. “పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సెలెన్స్” ఛారిటబుల్ ట్రస్ట్ నుండి సాయం. త్వరలోనే క్రికెటర్ రషీద్ ను కలుస్తానని తెలిపారు. అనంతరం ఈ నెల 14వ తేదీన ఇప్పటం వేదికగా జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్ల పై చర్చించారు.