గౌతంపూర్ లో జనం కోసం జనసేన

తెలంగాణ, కొత్తగూడెం: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ పోటీ చేస్తున్నందున జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా వేముల కార్తిక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జనం కోసం జనసేన” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గౌతంపూర్ లో ప్రజలను వేముల కార్తిక్ కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. ఈ ప్రోగ్రాంలో కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా, సెక్రటరీ సాయి అనిత్, పాల్వంచ మండలం సోషల్ మీడియా ఇంచార్జి షైక్ బాషా, పాల్వంచ మండలం వైస్ ప్రెసిడెంట్ గజ్జల సంపత్ రామ్ వర్మ, మిరియాల రామ్ గోపాల్ వర్మ, కోటగిరి రిషి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.