కామరాజుపేట గ్రామంలో జనం కోసం జనసేన

  • జనం కోసం జనసేన 603వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 603వ రోజు కార్యక్రమంలో భాగంగా పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం, కామరాజుపేట గ్రామంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1,02,060 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 604వ రోజు కార్యక్రమాన్ని శుక్రవారం గోకవరం మండలం, కామరాజుపేట గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. గురువారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు చల్లా రాజ్యలక్ష్మి, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కామరాజుపేట నుండి కరణం సూరిబాబు, నీలం నాని, జాజుల అశోక్, నీలం హరికృష్ణ, మారికొండ వెంకి, బోరగా కార్తీక్, కొత్తపల్లి నుండి సోలా అంజిబాబు, పువ్వల శ్రీదేవి, మాధారపు ధర్మేంద్ర, వనం నరేష్, వనం ప్రదీప్, చేదులురి సతీష్, మిరియాల శివ, వెంగయమ్మపురం నుండి సమ్మంగి వీరబాబు , గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, బూరుగుపూడి నుండి పెద్ది మణికంఠ లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.