కాటవరంలో జనం కోసం జనసేన – మహాపాదయాత్ర
- పాదయాత్రలో కొనసాగుతున్న చేరికలు
- జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తె వందనాంబిక ఆధ్వర్యంలో ఉత్సాహంగా కొనసాగుతున్న మహాపాదయాత్ర
- బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తె వందనాంబిక కు హారతులతో స్వాగతం పలికిన గ్రామ ప్రజలు
రాజానగరం: కోరుకొండ మండలం, కాటవరం గ్రామంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తె వందనాంబిక కలిసి పాదయాత్రగా గ్రామంలో ప్రతీ ఇంటికీ, ప్రతీ గడపకూ వెళుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీ సిద్దాంతాలను వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, పోకెట్ బ్యాడ్జ్, బొట్టు బిల్ల ప్యాకెట్ అందజేసిన బత్తుల. జనసేన కార్యకర్తలు, యువత, వీరమహిళలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-24-at-7.54.00-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-24-at-7.53.59-PM-1024x768.jpeg)