కొత్తగూడెంలో జనంకోసం జనసేన

తెలంగాణ, కొత్తగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేముల కార్తీక్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఆదివారం జనంకోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఇల్లందుపాడు తండా, పాండురంగపురం తండా గ్రామపంచాయతీలో ప్రజలను కలిసి వారి ప్రధాన సమస్య.లను అడిగి తెలుసుకున్నారు అందులో ముఖ్యంగా కొత్త పొడు భూమి పట్టాలు రాక ఇబ్బంది పడుతునట్లుగా ప్రజలు తెలియచేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం జనసేన ఇంచార్జి వేముల కార్తిక్ మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ రూరల్ జనరల్ సెక్రటరీ వల్లపు వెంకటేశ్, గౌతమ్, సతీశ్, వెంకటేష్, మహేష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.