మీకోసం జనసేన- డోర్ టు డోర్ కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు మహలక్ష్మినగర్ ప్రాంతంలో భద్రి ఆధ్వర్యంలోను ఆదివారం మెహర్ నగర్ శారదాదేవి గుడి ప్రాంతంలో భీష్మరాజు ఆధ్వర్యంలోను మీకోసం జనసేన అంటూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు ఆయాప్రాంతాలలోని ప్రజలను కలిసి వై.సి.పి ప్రభుత్వ అక్రమాలను, కుంభకోణాలను వివరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇమ్మని ప్రాధేయపడితే అభివృద్ధిలోను, ప్రజాసంక్షేమంలోను తనదైన శైలిలో చేసి ప్రజలను మెప్పించే విధంగా చేస్తాడనుకుని అధికారం అప్పచెప్పారనీ, తీరా అధికారంలోకి వచ్చాకా, ఆ అధికారాన్ని ఇచ్చిన ప్రజలను చూడటానికి సైతం విముఖతతో బయటకి వచ్చిన ప్రతిచోటా పరదాలు కట్టించి, ఆంక్షలు పెట్టి అవమానిస్తూ ఉండటాన్ని ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారనీ, తనని తాను మహారాజు లాగ ఊహించుకుంటూ ప్రవర్తిస్తూ ప్రజలని పట్టి పీడిస్తున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజల పక్షాన జనసేన నిలిచిందనీ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమికి తమ మద్దతునిచ్చి ప్రజా పాలనను తీసుకురాడానికి తోడ్పడవలసినదిగా కోరుతూ ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో గరగ శ్రీనివాస్, బద్రి, సతీష్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.