కే కిష్టాపురంలో పల్లె పల్లెకు జనసేన
గజపతినగరం నియోజకవర్గం: దత్తిరాజేరు మండలం, కే కిష్టాపురం జనసేన నాయకులు సారికి మురళి, అల్తీ రామారావు, మహేష్, సంతోష్, దుర్గారావు ఆధ్వర్యంలో సోమవారం పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం నిర్వహిచడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు శ్రీమతి పడాల అరుణమ్మ అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రెస్ కమిటీ మెంబర్ గెద్ద రవి, గజపతినగరం మండలం అధ్యక్షులు మునకాల జగన్ దత్తి రాజేరు మండలం అధ్యక్షులు చప్పా అప్పారావు, పడాల శరత్ చంద్ర, మామిడి దుర్గా ప్రసాద్, డాక్టర్ మురళి, యస్వంత్ గ్రామ జనసైనికులు, జనసేన నాయకులు మరియు టీడీపీ నాయకులు, వీరమహిళలు, ప్రజలు పాల్గొని అక్కడ ఉన్న సమస్యలు గురుంచి తెలుసుకున్నారు. అలాగే 2024లో జనసేన-టీడీపీ ప్రభుత్వంమే వస్తుంది అని పేర్కొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-11-at-9.21.12-AM-1024x768.jpeg)