కళాకారులకు జనసేన సంపూర్ణ మద్దతు: పాలవలస యశస్వి

విజయనగరం, జిల్లా రంగస్థల కళాకారుల సంఘం వారు, కళాకారుల కష్టాలను, ప్రభుత్వం చింతామణి నాటికను ప్రదర్శించకూడదని ఇచ్చిన జి.ఓ ప్రవేశపెట్టి కళాకారుల పొట్టమీద కొట్టారని, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి ని విజయనగరం కలక్టరేట్ వద్ద కళాకారులంతా కలసి తమ గోడును తెలిపారు. ఈ సందర్భంగా యశస్వి కళాకారులతో మాట్లాడుతూ చరిత్రాత్మకమైన చింతామణి నాటకం ప్రభుత్వం నిషేధించి, కళాకారుల పొట్టకొట్టిందని, కళాకారులకు జనసేన పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతానని తెలుపుతూ వారికి మద్దతు పలికారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం కళాకారులను ఆదుకోకపోగా, ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదని, చింతామణి నాటకం ప్రదర్శించకూడదన్న జి.ఓ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.