మైనర్ బాలిక సంధ్యారాణి కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

కదిరి, తనకల్లు మండల పరిధిలోని బొంతలపల్లి పంచాయతీ ఎర్రబల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక సంధ్యారాణి ఆత్మహత్య చేసుకొన్న కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన స్థానిక జనసేన నాయకులు అలాగే జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుల పిసిసి సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి, కదిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ భైరప్రసాద్ ఆ కుటుంబానికి ఫోన్ కాల్ ద్వారా సుధారాణి తల్లిదండ్రులతో మాట్లాడి ఈ బాధాకర సంఘటనకు విచారిస్తున్నాం మేము ఎప్పుడూ మీకు అండగా ఉంటామని నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చూస్తామని అధికారులపై ఒత్తిడి తెస్తామని భరోసా కల్పిస్తూ మాట్లాడడం జరిగింది. ఉమ్మడి జిల్లా జనసేన నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా కార్యక్రమాల నిర్వాహక కమిటీ సభ్యులు ఫయాజ్ , తనకల్లు మండలం జనసైనికులు మైనార్టీలు నాయకులు మన్సూర్ కాలేషా, మస్తాన్, ముబారక్, పాల్గొన్నారు. ఆత్మహత్యకు కారణమైన నల్లచెరువు మండలానికి చెందిన ఇంతియాజ్ పై దిశా డిఎస్పి చేత విచారణ జరిపించాలని ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చి కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది.