వరద బాధితులకు జనసేన సాయం

నెల్లూరు: చిల్లకూరు మండలం, లింగవరం పంచాయితీలోని తీగపలెం గ్రామంలోని వరద బాధితులను ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్ర శేఖర్ మరియు జనసేన నాయకులు కొండురు మహేష్, ఇంగిలాల కార్తీక్, ఆకుల సుధీర్ తదితరులు వెళ్లి పరామర్శించారు. మరియు వారు పడుతున్న అవస్థని చూసి ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వారికి 10 రోజుల నుండి విద్యుత్ కోత ఉంది. అందుకు గాను తీగల చంద్ర శేఖర్ ఆర్థిక సహాయంతో వారికి కొవ్వొత్తులు జెట్ కాయిన్ లు ఇవ్వడం జరిగింది. వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది.