కార్మిక సంఘాలకు అండగా జనసేన

  • మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
  • కార్మికులకు అండగా నిలిచిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ)

మైలవరం నియోజకవర్గం: మైలవరంలోని స్థానిక కొండపల్లి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయపరమైన డిమాండులు ప్రభుత్వం స్పందిచాలని, గత కొన్ని రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిది. ఇది యిలా ఉండగా, ఆదివారం కొండపల్లి మున్సిపాలిటీ కార్మికులపై పోలీస్ వారు జులుం విధిలించారు. ఇది తెలిసిన వెంటనే అక్కల రామ్మోహన రావు (గాంధీ) హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మున్సిపల్ అధికారులు, పోలీసుల నియంతృత్వ దోరణి పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి మున్సిపల్ కార్మికులకు అండగా నిలిచారు. మున్సిపల్ కార్మికుల విధులను వేరే వారితో చేయించేందుకు ప్రయత్నం చేసిన మున్సిపల్ అధికారులు, పోలీసులను అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోలియాశెట్టి శ్రీకాంత్,వై.ప్రవీణ్, పార్ధ సారధి, ఆనం మహేష్, సామల శ్రీనివాస్, చిట్టేలు హరీష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.