నిర్వాసితుల ఆవేదన సభలో జనసేన

నక్కపల్లి మండలం మూలపర్ర గ్రామంలో అఖిలపక్షంతో ఏర్పాటు చేసిన విశాఖ – చెన్నై కారిడార్ భూ నిర్వాసితుల సభలో జనసేన తరుపున పాల్గొన్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి మరియు పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి. నిర్వాసితుల భూములకు చెట్లకు భూ సేకరణ చట్టం 2013 ప్రకారం పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ తరుపున పూర్తి స్థాయి మద్దతు పోరాటం చివరి వరకు వుంటుంది అని చెప్పడం జరిగింది. సభా అధ్యక్షులు గబ్బర్ సింగ్, శంకర్ రావు, తాతారావు, గోవింద రాజులు, పిక్కి గోవిందు, బాడే శ్రీను, పీక్కి స్వామి, నూకరాజు మరియు రాజుసూర్య తదితరులు పార్టీ తరుపున పాల్గొనడం జరిగింది.