సర్వం కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు జనసేన భరోసా

  • ప్రమాద బాధిత కుటుంబాలకు బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు పంపిణి చేశిన వేగిశెట్టి సూర్య నిఖిల్

పిఠాపురం నియోజకవర్గం: ఉప్పాడ కొత్తపల్లి మండలం, పొన్నాడ పంచాయతీ కోనపాయిపేట గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రెండు పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. మరొక మత్స్యకార కుటుంబం జీవనాధారం అయిన వేటకు ఉపయోగించే వల కూడా కాలిపోవడంతో సంఘటనా స్థలాన్ని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బాధితులను పరామర్శించి, అన్నీ వేళలా అండగా ఉంటానని భరోసా కల్పించిన నాయకులు వేగిశెట్టి సూర్య నిఖిల్, వెన్నపు చక్రధర, మత్స అప్పాజీ, వేగిశెట్టి బాబులు, మత్స్యకార నాయకులు కంబాల దాసు, పల్లేటి బాపన్నదొర, మర్రి దొరబాబు, బోనం సాయి, గుండ్ర దుర్గా ప్రసాద్ రావివారిపోడు కోనపాయిపేట ఎప్పుడు అన్నదమ్ములులా ఉన్నాం, ఎవరికి ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా ఒకరికొకరు ఎప్పుడు అండగా ఉంటాం అని భరోసా ఇస్తూ వేగిశెట్టి సూర్య నిఖిల్ చిరు సాయంగా బ్బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు పంపిణి చేశారు.