జనసేన ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశం

  • జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణి చేసిన జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి ముఖరంచాన్

రాజంపేట, ఒంటిమిట్ట మండలం రాజంపేట నియోజకవర్గ ముస్లిం మైనారిటీ జనసైనికులతో శుక్రవారం జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి ముఖరంచాన్ ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర రాజకీయాలలో ముస్లిం మైనారిటీలకు లబ్ది చేకూరాలన్నా, జాతి మనుగడకోసం ముందడుగు వేయాలన్నా అది కేవలం జనసేన మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యం అవుతుందని చాన్ తెలియచేసారు. రాజకీయాలలో స్వార్ధం పనికిరాదని, నిస్వార్థపు వ్యక్తి అయితేనే ప్రజలను పాలించగల అర్హత ఉందని పవిత్ర ఇస్లాం తెలియచేస్తుందని… మరి అలాంటపుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన వైట్ పేపర్ లాంటి వారని కనుక ముస్లిం సోదరులు రానున్న రోజులలో తప్పకుండా జనసేనపార్టీ వైపు అడుగేయాలని అలాగే పవన్ కళ్యాణ్ ని గెలిపించే బాధ్యతను తీసుకోవాలని విచ్చేసిన జనసేన నాయకులు, జనసైనికులకు చాన్ ఉపదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ కువైట్ నుండి విచ్చేసిన జీలల్ షేక్ ముఖరంచాన్ ని మర్యాదపూర్వకంగా సత్కరించారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కిట్ ను నూతనంగా సభ్యత్వం తీసుకున్న ముస్లిం జనసైనికులకు చాంద్ చేతులమీదుగా అందచేయడం జరిగింది. ఈ ఆత్మీయసమావేశానికి విచ్చేసిన ప్రతి జనసైనికులకు, నాయకులకు చాన్ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసారు. రానున్న రోజుల్లో ముస్లిం జనసైనికులు పార్టీలో ప్రధాన భూమిక వహించబోతున్నారని చాన్ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్దుల లతిఫ్ షేక్, రాజంపేట పట్టణ జనసేన నాయకులు శంకర మరియు గోపాల్ అబ్బిగారి, సిరాజ్ షేక్, సలీం షేక్, అష్రాఫ్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.