జనసేన ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించిన జనసేనాని

  • సోమవారం నుండి అందుబాటులోకి ఉచిత అంబులెన్స్ సేవలు
  • రాజానగరం మూడు మండలాలలో మండలానికి ఒక అంబులెన్స్

రాజానగరం నియోజకవర్గ ప్రజల వైద్య సహాయార్థం అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కి వెళ్లడానికి గవర్నమెంట్ అంబులెన్సులు సరైన సమయంలో అందుబాటులో లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విషయంపై రాజానగరం నియోజకవర్గ బత్తుల బలరామకృష్ణ అకుంఠిత దీక్షతో ఆలోచించి జనసేన పార్టీ ద్వారా ప్రజలకు ఉచిత అంబులెన్స్ సేవలను అందించాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అంబులెన్స్ లను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ విధితమే. అయితే ఈ కార్యక్రమాన్ని ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో బత్తుల బలరామకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ అంబులెన్స్ సేవలు సోమవారం నుంచి రాజనగరం నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలలో మండలానికి ఒకటి చొప్పున అందుబాటులో ఉంటాయని బత్తుల బలరామకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.