ప్రజల సమస్యలపై పోరాటానికి జనసేన సిద్దం

చిత్తూరు జిల్లా అధ్యక్షులు సూచనల మేరకు జూమ్ సమావేశంలో చెప్పిన విధంగా స్థానికంగా నియోజకవర్గం ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించగా ప్రజలు వారి సమస్యలను తెలియజేస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనవాణి కార్యక్రమంలో ఈ సమస్యలను అందచేయబడుతుంది. ముఖ్యంగా జిల్లాలో గనుల సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు, రైతులకు లాభసాటి ధర, విద్యార్థులకు వెల్ఫేర్ హాస్టల్స్, ఫీజు రియంబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, విదేశీ విద్య, నూతన విద్యా విధానంలో విద్యా సంస్థలకు జరుగుతున్న లోపాలు, నగరి కార్మికుల సమస్యలు, తిరుపతిలో తోపుడుబండ్ల సమస్య తుడా ఫండ్స్ దారి మళ్లింపులు, వాహనదారుల సమస్యల గురించి, నీటి పారుదల సమస్యలు గురించి పార్టీ కోసం కష్టపడుతూ ప్రజల సమస్యలను గుర్తించి వారికి అండగా ఉన్న జనసేన కార్యకర్తల మీద జరుగుతున్న అన్యాయాల గురించి.. వైద్య విధానంలో లోపాలు, ఇసుక మాఫియాలో రాజకీయ నాయకుల ప్రజల వద్ద నుంచి వసూలు చేస్తున్న మామూలు గురించి #GoodMorningCMSir కార్యక్రమాన్ని జిల్లాలో చక్కగా నిర్వహించిన ప్రతి ఒక్కరినీ అభినందించి.. ఈ కార్యక్రమంలో సమస్యలకు రోడ్లు మరమ్మత్తులను ప్రభుత్వం చేపట్టడం జనసేన విజయంగా ప్రజలు తెలియజేస్తున్నారు.