జనసైనికుడు నాగరాజు కుటుంబానికి అండగా జనసేన
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, వీరులపాడు మండలం, కొనతాలపల్లి గ్రామంలో జనసైనికుడు గోబీనేని నాగరాజు ఆకస్మిత మరణం చెందారు. విషయం తెలుసుకున్న నందిగామ జనసేన సమన్వయ కర్త తంబళ్లపల్లి రమాదేవి కొనతాలపల్లి గ్రామంలోని (బీసీ కాలనీ) లో వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ గోబీనేని నాగరాజు మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి కి లోనయ్యానని, గోబినేని నాగరాజు తింటే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి చేసిన సేవలు మరువలేమని అటువంటి వ్యక్తి కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలబడతామని, వారికి ఎటువంటి సమస్య వచ్చినా నేను ముందుండి వారికి అండగా నిలబడతాను అని వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించి, వారి కుటుంబానికి జనసేన తరఫున భరోసా కల్పించారు. అక్కడనుండి జమ్మవరంలోని మండల అధ్యక్షుడు బేతంపూడి జయరాజు ఇంటిదగ్గర ఏర్పాటుచేసిన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత పొన్నవరం గ్రామంలోని జనసైనికుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-18-at-9.02.42-PM-1024x768.jpeg)