విద్య, వైద్యాన్ని అందరికీ ఉచితంగా అందించే సత్తా ఉన్న ఏకైక పార్టీ జనసేన

ఉమ్మడి బాపట్ల, వేమూరు నియోజవర్గం, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతు అను రాధ సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంపద సృష్టించి, దాని ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేసి.. బడుగు, బలహీన వర్గాలు ప్రతీ నెలా ప్రభుత్వం ఇచ్చే ఉచితాల కోసం ఎదురు చూడకుండా వారు కాళ్లపై వారు నిలబడి గౌరవంగా బ్రతక గలిగే ఏర్పాట్లు చేసి.. అన్నిటి కన్నా ముఖ్యమైన విద్య, వైద్యాన్ని అందరికీ ఉచితంగా అందించే సత్తా ఉన్న ఏకైక పార్టీ జనసేన మాత్రమే. అందర్నీ కోటీశ్వరులు చేస్తామని సొల్లు కబుర్లు చెప్పం.. సాధ్యాసాధ్యాలు చూడకుండా హామీలు ఇవ్వం.. సమాజానికి చేటు చేసే కానుకల రాజకీయాలు చేయం.. అందరికీ గర్వంగా తలెత్తుకుని జీవించే జీవితాన్ని ఇవ్వగలమని మాత్రం హామీ ఇస్తాం. మోసపూరిత మేనిఫెస్టోల కంటే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నిజాయితీ గల నాయకునితోనే ఇది సాధ్యం అని నిరూపిస్తాం. దటీజ్ జనసేన అని గర్వంగా చెపుతాం అని అను రాధ పేర్కొన్నారు.