కార్యకర్తల యోగక్షేమాలు ఆలోచించే ఏకైక పార్టీ జనసేన: శంకర్ గౌడ్

ఇటీవల ప్రమాదానికి గురై గాయాల పాలయిన “పెద్దపల్లి జిల్లా గర్రేపల్లి” గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు శ్రీ జెట్టి శ్రీకాంత్ కి పార్టీ క్రియా శీలక కార్యకర్తల భీమా పథకం ద్వారా 50,000 రూ. చెక్ అందజేసిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్. ఈ సందర్భంగా శ్రీ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ కార్యకర్తల యోగక్షేమాలు ఆలోచించే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని అన్నారు.