జగజ్జీవన్ రామ్ ఆశయసాధన కోసం జనసేన కృషి చేస్తోంది

*జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు, స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయ దురందరుడు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై తన జీవితాన్ని అంకితం చేసిన దేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకై జనసేన పార్టీ కృషి చేస్తుందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మంత్రిత్వశాఖలను బాబు జగజ్జీవన్ రామ్ నిర్వహించారన్నారు. తాను చేసే ప్రతీ ఆలోచన వేసే ప్రతీ అడుగు అట్టడుగు ప్రజల అభ్యున్నతికేనన్నారు. నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు గానే చూస్తున్నాయని కానీ అట్టడుగు వర్గాల గురించి వారి జీవన విధానాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది ఒక్క జనసేన మాత్రమేనన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్ బాబు, నారదాసు ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, జనసేన పార్టీ దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు , కొండూరు కిషోర్ కుమార్, అన్నదాసు సుబ్బారావు, యడ్ల నాగమల్లేశ్వరావు, నెల్లూరు రాజేష్, బాషా, సతీష్, సాగర్, గంగరాజు, ఆశోక్, సుంకే శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, స్వామి, దొంత సురేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.