ఉమ్మడి కర్నూల్ జిల్లాలో “జనసేన కౌలు రైతు భరోసా యాత్ర”

ఉమ్మడి కర్నూల్, జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 130 మంది కౌలు రైతుల కుటుంబాలను జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ నెల 8వ తేదీన శిరివెళ్ళ మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో ప్రతీ కుటుంబాన్ని పరామర్శించి, లక్ష రూపాయలు చొప్పున చెక్కులు అందజేస్తారు. ప్రజల డబ్బుతో సంక్షేమ పథకాలు నడుపుతూ, వాళ్ళ తాత, తండ్రుల పేర్లు పెట్టుకుని ఫోటోలు ముద్రించుకుని రాజకీయాలు చేసే నాయకులను చూశారు ఇన్నాళ్ళు. తన సొంత కష్టార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్, ప్రజలు మారాల్సిన సమయం ఆసన్నమైంది, కష్టం ఎక్కడ ఉంటే జనసేన పార్టీ ఎక్కడ ఉంటుందని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా సమ్యుక్త కార్యదర్శి కీర్తన అన్నారు.