తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు

జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ. అనంతరం పెనుగంచిప్రోలులోని కె వి ఆర్ గార్డెన్స్ లో జనసేన నియోజవర్గ ఆత్మీయ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిస మురళి కృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్, పెనుగంచిప్రోలు మండల అధ్యక్షుడు తునికిపాటి శివ, జగ్గయ్య పేట మండల అధ్యక్షుడు తులసి బ్రహ్మం, వత్సవాయి మండల అధ్యక్షుడు రేగళ్ల వెంకటరామయ్య, నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.