బాధితులను పరామర్శించిన డి.ఎమ్.ఆర్ శేఖర్

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం ఏయంజి కాలనీలో ఇద్దరు మహిళలపై ఒక ఉన్మాది చేసిన దాడిలో మృతి చెందిన శ్రీదేవి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరుగుచున్న పోస్ట్ మార్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ డి.ఎమ్.ఆర్ శేఖర్. గాయపడిన వెంకటరమణమ్మను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, జనసేన నాయకులు లింగోలు పండు, కొప్పుల నాగ మానస, పడాల నానాజీ, డి.యస్.యన్.కుమార్, పోలిశెట్టి మహేష్ తదితరులు ఉన్నారు.