విలేకరుల ఆత్మీయ సమావేశంలో జనసేన నాయకులు

అనంతపురం జిల్లా, పెనుగొండ నియోజకవర్గం, పరిగి మండలంలో జిల్లా సంయుక్త కార్యదర్శి మోద శివ ఆధ్వర్యంలో పరిగి మండల విలేఖరుల మిత్రులతో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పరిగి ఎస్ఐ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ సమాజంలో అందరి కంటే ముందు ఉండి ఏ సమయంలోనైనా ఎక్కడికైనా నా చురుగ్గా వెళ్లి విషయం సేకరిస్తూ సమాజానికి అందించేది విలేకరులు అని తెలిపారు. జర్నలిస్ట్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు చేసిన ప్రజా సమస్యలపై పోరాడిన దాన్ని మేము తప్పకుండా సమాజానికి తెలియజేస్తామని తెలిపారు. ఎంతో మంది యువత ఇక్కడకు వచ్చారు అని మంచి నాయకుడిగా ఎదగాలని పెద్దవాళ్లు సలహాలతో రాబోయే రోజుల్లో నాయకులుగా మీరు ఎదగాలని అన్నారు.