మెగాస్టార్ చిరంజీవి క్రికెట్ టోర్నమెంట్ 2022 కార్యక్రమంలో జనసేన నాయకులు

రాజమహేంద్రవరం, మెగాస్టార్ కొణిదెల చిరంజీవి జన్మదిన వేడుకలలో భాగంగా చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి ఏడిద బాబీ ఆద్వర్యంలో రాజమహేంద్రవరంలో “మెగాస్టార్ చిరంజీవి క్రికెట్ టోర్నమెంట్ 2022” కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజానగరం ఇంచార్జి మేడా గురుదత్ ప్రసాద్, రాజమండ్రి ఇంచార్జి అత్తి సత్యనారాయణ, జనసైనికులు మరియు మెగా అభిమానులు పాల్గొన్నారు.