కోటప్పకొండ వన భోజన కార్యక్రమంలో జనసేన నాయకులు

నరసరావుపేట కాపు కార్తీక వన సమారాధన స్థానిక కోటప్పకొండ లోని కాపు అన్నదాన సత్రం లో ఘనంగా నిర్వహించడం జరిగింది. వన భోజన కార్యక్రమం లో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర రావు గారు మాట్లాడుతూ. వైయస్సార్ సిపి తెలుగుదేశం పార్టీ కాపులను ఓటు బ్యాంకుగా మాట్లాడుకుంటుంది అని. ఆంధ్రప్రదేశ్లో కాపులకు న్యాయం జరగాలి అంటే. జనసేన పార్టీ అధికారంలోకి రావాలని. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని. దానికి కాపు సంఘాలు సోదరీ సోదరీమణులు అందరూ మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనందబాబు, బెల్లంకొండ ఈశ్వర్, గుప్త శ్రీకాంత్, బెల్లంకొండ అనిల్. బోనం జయరాం, రామిశెట్టి రామకృష్ణ, కృష్ణం శెట్టి గోవిందు, మేడిశెట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు.