వర్షంలో ప్రచారం చేసిన జనసేన నాయకులు

ఎచ్చెర్ల, పెద్దకొత్తపల్లి పంచాయతీలో ప్రతి ఇంటికి వెళ్లి ఈవీఎం పై ఓటు ఎలా వెయ్యాలో జనసేన నాయకులు కాకర్ల బాబాజీ అవగాహన కల్పించడం జరిగింది. అలానే ఎండి.ఏ కూటమి మేనిఫెస్టో తెలియజేశారు. అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఒకటవ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే మరియు ఎం.పి ఇద్దరినీ భారీ మెజారిటీతో గెలిపించలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరిళ్ల ప్రసాద్, బగ్గు వెంకటేష్, సంతు, మన్మధ, జయప్రకాష్, జగదీష్ గ్రామ నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.