టిడిపి అభ్యర్థి ఆనందరావు ప్రచారంలో జనసేన నేతలు

కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గ కూటమి తెలుగు దేశం అసెంబ్లీ అభ్యర్థి అయితా బత్తుల అనందరావు అమలాపురం రూరల్ ఏ. వేమవరం, వేమవరపు పాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా ప్రచారంలో కర పత్రాలు పంచి పెట్టి, తెలుగు దేశానికీ ఓటు వేయాలని కోరారు. తెలుగు దేశం నాయకులు అధికారి జయ లక్ష్మి, పెచ్చేట్టి విజయలక్ష్మి, రాష్ట్ర తెలుగు దేశం వాణిజ్య విభాగంఅధికార ప్రతినిధి కర్రి రామస్వామి (దత్తుడు), జనసేన ఎమ్ పి టీసి మోటూరి కనక దుర్గ, జనసేన నాయకులు లింగోలు పండు, మోటూరి వెంకటేశ్వరావు పాల్గొన్నారు.