సాత్విక్ కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

అమలాపురం: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ తండ్రి ప్రముఖ విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. శనివారం ఆయన కుటుంబ సభ్యులను జనసేన నాయకులు బండారు శ్రీనివాస్, నల్లా శ్రీధర్, ఏడిద శ్రీను, సిరిగినీడి వెంకటేశ్వరరావు తదితరులు పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. వీరితో పాటు పడాలా నానాజీ, నల్లా వెంకటేశ్వరరావు, గట్టెం వీరు, పోలిశెట్టి పవన్ మహేష్, యర్రంశెట్టి నాగేంద్ర తదితరులున్నారు.

Share this content:

Post Comment