గోపీచంద్ మలినేనికి అభినందనలు తేలియజేసిన జనసేన నాయకులు

పెనుకొండలో జరుగుతున్న వీరసింహరెడ్డి సినిమా షూటింగ్ సందర్భంగా వీర సింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేనిని మర్యాదపూర్వకంగా కలిసి చిత్రబృందానికి పెనుకొండ జనసేన పార్టీ నాయకులు అభినందనలు తేలియచేయడం జరిగింది. అలాగే భవిష్యత్ లో ఇంకా ఎన్నో సినిమాలు ఇక్కడ పెనుకొండలో షూటింగ్లు జరగాలని పెనుకొండ ను పర్యాటక ప్రాంతంగా గుర్తించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గనాయకులు కుమార్ రాజేష్, మండల అధ్యక్షులు మహేష్, నాయకులు బంగారం, హరి నాయక్ పుట్టపర్తి కన్వీనర్ పెద్దన్న, వీర మహిళ శిరీష తదితరులుపాల్గొన్నారు.