పవన్ కళ్యాణ్‌కు జనసేన నేతల ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆదివారం మదురై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హిందూ మున్నానీ సంస్థ ఆధ్వర్యంలో మదురైలో జరుగుతున్న మురుగన్ భక్తుల మహానాడు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి నుండి వచ్చిన జనసేన నేతలు ఆరణి మదన్ మోహన్, రాజా రెడ్డి, సుభాషిని, బాబ్జి, అనిల్ తదితరులు పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. వీరమహిళలు, జనసైనికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Share this content:

Post Comment