జనసేన అభివృద్ధికి కృషి చేసిన బర్మా ఫణి బాబుని సత్కరించిన జనసేన నాయకులు

నూజివీడు: మార్చి 14వ తేదీ జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన నాటి నుండి నూజివీడు నియోజకవర్గంలో ఛలో మచిలీపట్నం కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన కమిటీ కో ఆర్డినేటర్ పాణ్యం నియోజకవర్గ ఇంచార్జి చింత సురేష్ పర్యవేక్షణలో మార్చి 14న నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల నుండి వందలాది బైక్, కార్ల రాలీ కి, వేలాది మంది కార్యకర్తలకు పూర్తిగా ఆహార వసతులు, వాహన ఏర్పాట్లు చేసిన నూజివీడు నియోజకవర్గ నాయకులు బర్మా ఫణి సారథ్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సభని విజయవంతం చేయడంతో శుక్రవారం బర్మా ఫణి బాబుని వారి స్వగృహంలో నియోజకవర్గ జనసేన నాయకులు కలిసి సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట వెంకట్రావు, పాశం నాగబాబు, సూరిశెట్టి శివ, యాదల వెంకటేశ్వరరావు, ముక్కు మహేష్, వలసపల్లి రామకృష్ణ, పాదం శివకృష్ణ, చింత శ్రీను, గొల్లపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.