డా.వంపురు గంగులయ్యని సన్మానించిన జనసేన నాయకులు

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, కొత్త పాడేరు గ్రామంలో దసరా ఉత్సవాలలో భాగంగా జనసేన పార్టీ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్యని ముఖ్య అతిధిగా ఆహ్వానించినప్పటికి భారీ వర్షాల కారణంగా గంగులయ్య హాజరు కాలేకపోయారు. విషయం తెలుసుకున్న కొత్త పాడేరు గ్రామ యువత, మహిళలు, గ్రామస్తులు జనసేనపార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని పాడేరు, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్యకి దుశ్శాలువ కప్పి సన్మానం చేస్తూ మేమందరు మహిళలమే అయినప్పటికీ జనసేనపార్టీ గెలుపు కొరకు సాటి మహిళలకు చైతన్యం తీసుకొచ్చేవిధంగా ఆలోచన చేస్తామని పార్టీ బలోపేత నిర్మాణానికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్బంగా డా.వంపురు గంగులయ్య మాట్లాడుతూ మహిళలలో ఈపాటి రాజకీయ చైతన్యం రావడం ఎంతో శుభపరిణామామని, మీరందరు సహకరించి పార్టీ బలోపేత నిర్మాణానికి మీ వంతు కృషి ఎంతో అవసరమని, రాబోయే ఎన్నికలలో జనసేనపార్టీని గెలిపించుకుని భావితరాలకు భవిష్యత్ ఇచ్చే ఆలోచన చేయాలని, ఈ సందర్బంగా జనసేనపార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్క వీరమహిళకు పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, పార్లమెంట్ ఎక్సిక్యూటివ్ మెంబర్ కొర్ర కమల్ హాసన్,జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, సాలేబు అశోక్, కిల్లో అశోక్ కుమార్, సంతోష్, గ్రామస్తులు యువత, వీర మహిళలు పాల్గొన్నారు.