వారాహి యాత్ర ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో జనసేన నేతలు

కత్తిపూడి: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నవరంలో బుధవారం సత్యదేవుని దర్శనం తర్వాత వారాహి యాత్రలో కత్తిపూడి జరిగే సభకు అన్ని ఏర్పాట్లు కె.కె ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వంతో కలిసి కత్తిపూడి బాబీ ఇంటి వద్ద చర్చించారు. రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్య రాజ్య సమితి అవార్డు గ్రహీత శ్రీ మేడ గురుదత్ ప్రసాద్ గారు, తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి, రియాజ్, పంచకర్ల సందీప్, వై. శ్రీనివాస్ అమ్మిశెట్టి వాసు, రావడ నాగు ఇతర పెద్దలు పాల్గొన్నారు.