అనంతసాగరం చెరువును పరిశీలించిన జనసేన నాయకులు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-16-at-2.56.18-PM-1024x768.jpeg)
ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలంలోని గోవిందంపల్లి, మంగుపల్లి, పాతాళపల్లి, ముస్తాపురం, కామిరెడ్డిపాడు, చిలకలమర్రి, గౌరవరం గ్రామాలకు చెందిన పంటపొలాల ముంపునకు కారణంగా స్థానిక రైతాంగం భావిస్తున్న, అనంతసాగరం చెరువు యొక్క ప్రధాన అలుగును, స్థానిక జనసేన నాయకులతో కలసి ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్, నలిశెట్టి శ్రీధర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ భరత్, రవి ఉదయగిరి, నాగరాజు యాదవ్, అనిల్ రాయల్, కృష్ణ మూర్తి యాదవ్ పాల్గొన్నారు.