జిల్లా కలెక్టర్, ఒంగోలు ఆర్డిఓ, టంగుటూరు శీ లను బాధితుల న్యాయం కోసం కలిసిన జనసేన నాయకులు

ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో టంగుటూరు మండలంలో జగనన్న కాలనీలో నకిలీ సర్వే నెంబర్లు, నకిలీ ఇంటి పట్టాలు, నకిలీ స్టాంపులతో అమాయక ప్రజలను మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఇల్లు లేని నిరుపేదలకు మోసపోయిన అమాయకులకు న్యాయం చేయాలి, అధికారం చేతిలో ఉంది అని అమాయక ప్రజలను మోసం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను జనసేన నాయకులు కోరారు. అమాయకపు పేదవారు అయిన సోమేపల్లి కల్పన, షేక్ హుస్సేన్ బి, చెన్ను పూర్ణాదేవిలా దగ్గర బొల్ల హరీష్ అనే వైసిపి పార్టీకి చెందిన వ్యక్తి డబ్బులు తీసుకుని, నకిలీ ఇంటి పట్టాలు ఇచ్చి మోసం చేశారు, ఇతను చేసిన అవినీతిని ఆధారాలతో సహా అధికారులకు ఇవ్వడం జరిగింది. అతి తొందరలో వైసిపి పార్టీకి చెందిన పుట్ట వెంకట్రావు, ఎస్.కె అలెగ్జాండర్ అనే వ్యక్తులు చేసిన అవినీతిని నిరూపించి శిక్ష పడేవిధంగా చేస్తాము, జనసేన పార్టీ ప్రతి పేదవాడికి అండగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము, కొండపి నియోజకవర్గంలో ప్రజలకు సమస్యలు వస్తే జనసేన పార్టీ వద్దకు రండి అని నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. అధికారులను కలిసిన వారిలో టంగుటూరు మండలం జనసేన పార్టీ నాయకులు లింగంగుంట చంద్రవాస్, అత్యల సురేష్ బాబు, వరికూటి చిరంజీవి, చనగర రాజేష్, దివాకర్, నాగార్జున, వాసు పాల్గొన్నారు.