ఆపదలో అండగా ఆమదాలవలస నియోజకవర్గం జనసేన నాయకులు
ఆమదాలవలస నియోజకవర్గం: బూర్జ మండలం, సింగన్న పాలెం గ్రామానికి చెందిన చల్లా లితిష. బ్రెయిన్ మారొ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న కొత్తకోట నాగేంద్ర(బుర్జ మండల అధ్యక్షులు) గారి ఆధ్వర్యంలో, కొల్ల జయరామ్, ఎంపిటిసి విక్రమ్, తులగాపు మౌలీ,కిల్లానా నరేష్, తులగాపు తిరుపతి రావు, గేదెల వాసు, మహేష్ మరియు జనసైనికులు, ఊరు పెద్దలు,యువత సహకారంతో తమవంతు సహాయంగా రూ. 20000/ ఆపరేషన్ నిమిత్తం ఆ కుటుంబానికీ అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీ పరంగా మరింత సహాయం చేయడానికి కృషి చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-16-at-10.08.25-PM-1024x768.jpeg)