శివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న జనసేన నాయకులు

మహా శివరాత్రి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు చిలకలూరిపేట నియోజకవర్గం, పొన్నూరు నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గలలో మహా దేవుడు పరమశివుని ఆలయాల వద్ద భక్తులకు ప్రసాదాలు, మజ్జిగ, అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, చిలకలూరిపేట నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు పాల్గొని కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, మేకల రామాయ యాదవ్, చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజా రమేష్, పొన్నూరు మండల అధ్యక్షులు వీరెల్ల వెంకటేశ్వరరావు, చుండూరు మండల అధ్యక్షులు మరియు సర్పంచ్ ఆమ్మిశెట్టి శ్రీరాములు, కాకాని గ్రామ అధ్యక్షుడు మండలనేని శ్రీనివాసరావు, మధు లాల్, శ్రీధర్, నాగభూషణం, చింత శివ, గోపిశెట్టి సాయి, నియోజకవర్గాల పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.