జనసేన కార్యకర్తకు నివాళులర్పించిన జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా బెస్తవారపేట మండలము సింగరపల్లి గ్రామం చెందిన జనసేన కార్యకర్త కీ.శే బండ్ల వేంగయ్య నాయుడు 18.01.2021 వ తేదీన మరణించినారు. ఆయనను గుర్తు చేస్తూ గిద్దలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ బెల్లంకొండ సాయిబాబు ఆదేశాల మేరకు నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాలరంగయ్య , బెస్తావారపెట మండలము అధ్యక్షుడు పిడతల సాయిబాబు, కంభం మండలం అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్, బండ్ల వెంగయ్య నాయుడు సతీమణి బండ్ల నారాయణమ్మ మరియు జనసేన కార్యకర్తలు శ్రీపతి కాశయ్య రంగనాయకులు, వంశీ, షేక్ ఇషాక్ తదితరులు పాల్గొన్నారు.