రైలు ప్రమాద సంఘటన స్థలానికి హుటాహుటిన జనసేన నాయకులు
విజయనగరం జిల్లా, ఎల్.కోట మండలం, కంటకాపల్లి గ్రామంలో జరిగిన రైలు ప్రమాద సంఘటన స్థలానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మరియు ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కో-ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్ హుటా హుటిన చేరుకొని పరిశీలించారు. అధికారులు చేపడుతున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు చేపడుతున్న సహాయ చర్యలపై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న జనసైనికులు సహాయక చర్యలు అందజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-29-at-22.51.35-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-30-at-00.50.06-1019x1024.jpeg)