సోమశిల జలాశయం సందర్శించిన జనసేన నాయకులు షేక్ మహబూబ్ మస్తాన్

ఆత్మకూరు, సోమశిల జలాశయం వద్ద కోట్ల రూపాయలతో జరుగుతున్న ఆఫ్రాన్ పనులను వెంటనే పూర్తి చేయాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మాట్లాడుతూ… గత రెండు సంవత్సరాలు వర్షాలు కారణంగా డ్యామ్ ముందు భాగము 20 నుంచి 30 అడుగులు గోతులు పడ్డాయి. 2020 2021 లో వచ్చిన భారీ వర్షాల కారణంగా డ్యామ్ ముందు నిర్మాణం పనులు ఫిబ్రవరి నెలలో సాయికృష్ణ సంస్ద 117 కోట్లతో టెండర్ దక్కించుకుంది. ఈ ఆఫ్రాన్ పనులు మార్చ్ నెలలో ప్రారంభం అయినా ఇప్పటివరకు పూర్తి కాకపోవడం జలవనరులు అధికారుల నిర్లక్ష్యమని పరిశీలించిన అనంతరం డ్యామ్ యుద్దప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని అఫ్రాన్ ఎడమ వైపు ఉన్న రిటేనింగ్ వాల్ ఎత్తు వెడల్పు పెంచాలని నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా రాబోయే రోజుల్లో వచ్చే వర్షాకాలంలో దినిని పూర్తి చేయాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.