జనసేన కార్యకర్తకు వైద్యం చేయించిన జనసేన నాయకులు

పిఠాపురం నియోజకవర్గం: జనసేన కార్యకర్త కసిరెడ్డి నాగేశ్వరరావు బుధవారం ఉదయం కింద పడిపోవడంతో కాలు కదపలేనిపరిస్థితిలో ఉండగా వెంటనే అక్కడున్న జనసేన యువనాయకులు ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. వారు వెంటనే స్పందించి పిఠాపురం గవర్నమెంట్ హాస్పటల్లో చెకప్ చేయగా కాలు బెణికింది, ఏం పర్వాలేదు అని చెప్పి రెండు మూడు రోజులు కరెంటు పెడితే సరిపోతుందని డాక్టర్ చెప్పడం జరిగింది. వెంటనే నాగేశ్వరరావుకు ధైర్యం చెప్పి ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన జనసేన యువ నాయకులకు టైల్స్ బాబీ, తోట సతీష్, పబ్బి రెడ్డి, ప్రసాద్, నామ శ్రీకాంత్ మరియు పి ఎస్ ఎన్ ముర్తిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.