బలసా శ్యామ్ సుందర్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

రాజాం, జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు బలసా శ్యాంసుందర్, తల్లి బలసా సీతమ్మ ఇటీవల కాలం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఏ.ఐ.టి.కె.ఎస్.ఎస్ జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ రాజాం నియోజకవర్గం రేగిడి మండలం, సంకిలి గ్రామంలో ఉన్న బలసా శ్యామ్ సుందర్ స్వగృహానికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బలసా సీతమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment