బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాల మరియు కళాశాలని సందర్శించిన జనసేన నాయకులు

ఖమ్మం, రఘునాదపాలెం బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాల మరియు కళాశాలని సందర్శించి విద్యార్ధినుల యొక్క సమస్యలు తెలుసుకొని, విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేయడం జరిగింది. ఆ కళాశాల సమస్యలను ప్రిన్సిపాల్ జ్యోతి మేడం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం వెంటనే కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ అధ్యక్షురాలు హరిప్రియ, తెలంగాణ జనసేన విద్యార్ది విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ పవన్ కుమార్, జిల్లా విద్యార్ది నాయకులు గంగాధర్, సాయి చంద్, మరియు అమృత, జాను, జ్యోతి, విజయ్, సుధీర్, నాగేందర్ తదితరుల పాల్గొన్నారు.