అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం, కొల్లాపూట్ పంచాయతి, బొడ్ల మామిడి గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పర్యటించటం జరిగింది. అందులో భాగంగా సంబంధిత గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించటం జరిగింది. అలాగే గ్రామస్తులు వారు ఎదుర్కొంటున్న ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు సమస్య కారణంగా ఉపాధిని కోల్పోతున్నామని, కావున సరిహద్దు సమస్య పరిష్కరించాలని కోరటం జరిగింది. అలాగే రహదారి మరియు మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరటం జరిగింది. ఈ పర్యటనలో అరకు టీడీపీ ఇంచార్జ్ మరియు విజయనగరం ఆర్టీసి రీజియన్ చైర్మన్ సియ్యారి ధోన్ను దొర, జనసేన పార్టీ పాయింట్ అఫ్ కాంటాక్ట్ చెట్టి చిరంజీవిరితో పాటు ఇరు పార్టీలు నాయకులు పాల్గొనటం జరిగింది.
Share this content:
Post Comment