జడ్డు బాలరాజును పరామర్శించిన జనసేన నాయకులు

పాలకొండ, బూర్జ మండలం, రాష్ట్రంలో అరాచక పాలనను సాగిస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీకాకుళం పార్లమెంటరీ టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ మరియు పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ప్రతినిధి జనసేన జానీ అన్నారు. మండలంలోని డొంకల పర్త ఇటీవలే ప్రమాదంలో గాయపడిన ఎలక్ట్రానిక్ మీడియా జడ్డు బాలరాజు కుటుంబాలను మంగళవారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై పలువురు వైసిపి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు నిస్సిగ్గుగా ఉందని అన్నారు. ఇటువంటి వారిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. సంక్షేమ పథకాలు పేరుతో ప్రజలపై భారం మోపడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. అవినీతి జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆపార్టీ ఏవిధమైన నైతిక విలువలు పాటిస్తుందో అర్ధమవుతుందని పేర్కొన్నారు. ప్రధానంగా మండలంలో డిఏపి, యూరియా కొరత ఉందని, నిత్యావసర సరుకులు పెరిగిపోయావని, ప్రతి గ్రామములో ఎన్నో సమస్యలు ఉన్నాయని అవి పట్టించుకోవడంలేదని కొనియాడారు, ప్రజలకు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కాలం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పిటిసి అనెపూ రామకృష్ణ, సర్పంచ్ ప్రతినిధి గణపతి, జడ్డు కృష్ణ, జడ్డు చిన్నం నాయుడు, ఆదినారాయణ, కృష్ణ, బెనర్జీ, పోలయ్య పాల్గొన్నారు.