రాయపూడిని పరామర్శించిన జనసేన నాయకులు

అవనిగడ్డ నియోజకవర్గం: కృష్ణా జిల్లా అధికారప్రతినిధి, జనసేన పార్టీ రాయపూడి వేణుగోపాల్ రావు గత కొంతకాలం నుండి ఆరోగ్య పరిస్థితి బాగోని విషయం అందరికి తెలిసినదే. ఆయన హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకోన్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దలు శివశంకర్, మచిలీపట్నం నియోజకవర్గం ఇంచార్జి బండి రామకృష్ణ, మైలవరం నియోజకవర్గం ఇంచార్జి అక్కల రామమోహన్ గాంధీ, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు చౌదిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తిన హరీరామ్, పండమనేని శ్రీనివాస్, పెద్దలు పీరటి కనుమూరి, జనసేన పార్టీ నాయకులు తుంగల నరేష్, కమతం నరేష్, ఉల్లి శేషగిరి, గాదె రమేష్, ఆంజనేయులు, నాగాయలంక యువనాయకులు భోగది శివవిష్ణు మిత్రబృందం, జనసేన పార్టీ వీరమహిళలు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రావు మాట్లాడుతూ జనసేన కుటుంబం నా దగ్గరికి వచ్చి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోని నాకు మనోనిబ్బరం కలిపించినందుకు అందరికి పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు.